యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్షల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన ఏపీ పీఎస్సీ గ్రూపు-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేశారు. వచ్చే నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు జరగాల్సివుంది. వీటిని యూపీఎస్సీ పరీక్షల కారణంగా జూన్ మొదటివారానికి వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ...