శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 31 డిశెంబరు 2018 (11:20 IST)

చెన్నై మెరీనా బీచ్‌లో ధోనీ, జీవా ఇలా చేశారు.. (వీడియో)

మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే ఐపీఎల్ పోటీల్లో ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను మేనేజ్‌మెంట్‌తో ఏర్పాట్లు, ఆటగాళ్లకు శిక్షణ తదితర అంశాలపై చర్చించేందుకే ధోనీ చెన్నైకి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో ధోనీ తాజా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం చెన్నైకి తన కుటుంబంతో వచ్చిన ధోనీ.. కుమార్తె జీవాతో కలిసి మెరీనా బీచ్‌కి వెళ్లాడు. అక్కడ ఇసుకలో గూళ్లు కట్టాడు. గుంతతీసి.. తన కుమార్తెను అందులోకి దింపాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
కాగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో వన్డేలు, ట్వంటీ-20ల్లో ఆడేందుకు ధోనీ వెళ్లనున్నాడు. ప్రస్తుతం చెన్నై బీచ్‌లో జీవాతో కలిసి ధోనీ ఆడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.