మంగళవారం, 27 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 3 మార్చి 2025 (22:54 IST)

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? మీరు ఎండుద్రాక్షలను నానబెట్టి ప్రతిరోజూ తినవచ్చు. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో ఒకటి. ఇవి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఎండు ద్రాక్షలో వుండే విటమిన్లు ఎ, ఇ వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి.
బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి.
ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది.
సోడియం సమతుల్యతను కాపాడే పొటాషియం ఉంటుంది.
ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
ఎర్ర రక్త కణాలకు అవసరమైన ఇనుమును కలిగి ఉంటుంది
దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి.