1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. parameswara mahima's

శివునికి బిల్వ పత్రాలతో పూజలు ఎందుకు చేస్తారంటే?

పరమశివుడు దయా సముద్రుడు పిలిస్తే పలికే దైవం. దోసెడు నీళ్లతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే చాలు ఆయన సంతోషపడిపోతాడు. సంతృప్తి చెందుతాడు. అలా సదాశివుడు అభిషేకానికే ఆనందించడానికి బిల్వ పత్రాలతో ప్ర

parameswara
పరమశివుడు దయా సముద్రుడు పిలిస్తే పలికే దైవం. దోసెడు నీళ్లతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే చాలు ఆయన సంతోషపడిపోతాడు. సంతృప్తి చెందుతాడు. అలా సదాశివుడు అభిషేకానికే ఆనందించడానికి బిల్వ పత్రాలతో ప్రీతి చెందడానికి కారణం లేకపోలేదు. పూర్వం సముద్ర మథనం హాలాహలం పుట్టినప్పుడు సమస్త జీవులను కాపాడడం కోసం ఆయన ఆ విషాన్ని కంఠంలో బంధించాడు. ఆ కారణంగా ఆయన తల భాగమంతా వేడెక్కింది.
 
ఆయన శిరస్సు చల్లబడడం కోసం దేవతలంతా నీటితో అభిషేకం చేశారు. బిల్వ పత్రాలు చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. అందువలన దేవతలు వాటితో శివుడిని పూజించారు. అప్పుడు శివుడికి ఉపశమనం కలిగింది. అందువలన శివుడికి అభిషేకం బిల్వ పత్రాలతో పూజ ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. మహా శివరాత్రి రోజున ఆ దేవదేవునికి అభిషేకించి బిల్వ పత్రాలతో పూజించేవారికి మరింత విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
20-07-2018 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. చిన్న చిన్న కలహాలు..