1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఏప్రియల్ 2022 (16:47 IST)

తెలంగాణ గవర్నర్ తమిళసైతో కేఏ పాల్ భేటీ: రేపోమాపో కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ మీడియాతో...

ka paul
తెలంగాణ గవర్నర్ తమిళసైతో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అరెస్ట్ ఖాయం అంటూ బాంబు పేల్చారు. తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా 8 లక్షల కోట్లు ప్రజాధనం కేసీఆర్ దోచుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 
మునుపు తను ఎప్పుడు వచ్చినా ఎంతో గౌరవంతో మాట్లాడే కేసీఆర్ కళ్లు ఇప్పుడు నెత్తికెక్కాయనీ, కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసేందుకే అమెరికా నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో తెరాసకి 30 సీట్లు కూడా రావని అన్నారు. ఈ మాట తను చెప్పడంలేదనీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో కేసీఆర్ కి ఏం చేయాలో తెలియకు ఏవేవో జిమ్మిక్కులు చేస్తున్నారంటూ విమర్శించారు.

 
ఇక ఆంధ్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జగన్ చేసిన అప్పులను తీర్చేందుకు కనీసం 20 ఏళ్ల కాలం పడుతుందని అన్నారు. మొత్తమ్మీద అటు కేసీఆర్ పైన ఇటు జగన్ పైన కేఏ పాల్ విమర్శనాస్త్రాలు సంధించారు.