శివుడి వరంతో ఏర్పడిన వాస్తు!
Vastu purush
ఒకసారి అంధగన్ అనే రాక్షసుడికి, శివుడికి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు శివుని చెమట నుండి గొప్ప రాక్షస శక్తి ఉద్భవించింది. అది రాక్షసుడిగా మారి శివుని ఆజ్ఞతో అంధగన్ను హతమార్చింది. అప్పుడు శివుని నుండి అనేక అద్భుతమైన వరాలు పొంది ప్రపంచాన్ని శాసించాడు. ఈ రాక్షసుడిని నియంత్రించడంలో భాగంగా శివుడు.. వీరభద్రుడి సాయం తీసుకున్నాడు. వీరభద్రుడు ఆ రాక్షసుడిని బోల్తా పడేలా చేసి భూమిలో పడేశాడు.
పడిపోయిన రాక్షసుడు మళ్లీ లేవకుండా నిరోధించడానికి, వీరభద్రుడు దేవతలను తనపై నివసించేలా చేశాడు. అతనికి భూమి ఆకారంలో ఉన్న గుమ్మడికాయను ఆహారంగా ఇచ్చాడు. దేవతల పాదాలను తాకడం వల్ల రాక్షసుడు పుణ్యాత్ముడయ్యాడు.
అలాగే అతడు భూమిపై నివసించే మనుష్యులచే పూజించేందుకు అర్హుడు అయ్యాడు. అంతే కాకుండా భూమికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా వాస్తు పురుషుడైన నిన్ను పూజించిన తర్వాతే ఇతర పనులు ప్రారంభిస్తానని ఈశ్వరుడు వరం ఇవ్వడంతో.. ఆయన వాస్తు పురుషుడు అయ్యాడు.
