మామిడితో ఇన్ని లాభాలా? మధుమేహ వ్యాధిగ్రస్తులకు...?
mango
ఆహారంలో మామిడి పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల పురీషనాళ క్యాన్సర్ను నిరోధించవచ్చు. మామిడి జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. పురుషనాళాన్ని శుభ్రపరుస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది.
శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో మామిడిని దివ్యౌషధంగా పనిచేస్తుంది. మామిడి ఆకులను తేనెతో కలిపి, నీటిలో నానబెట్టి, ఆ నీటిని త్రాగితే చెవిపోటు, గొంతునొప్పి తొలగిపోతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక మామిడి ఆకులను తీసుకుని, ఎండబెట్టి, పొడి చేసి, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 2 చెంచాల మోతాదులో వేడి నీటితో కలిపి తాగితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
