1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (17:29 IST)

ఆసియా కప్ : భారత్ స్కోరు 142/2 : అడ్డుకున్న వరుణ దేవుడు

cricket stadium
ఆసియా కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం హైఓల్టేజ్ మ్యాచ్‌ భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. 21.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిది. ఆ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఓ మోస్తారు వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. 
 
వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే సమయానికి కేఎల్ రాహుల్ 17, విరాట్ కోహ్లీ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో షాదాద్ ఖాన్, షహీన్ ఆఫ్రిదిలు తలా ఒక్కో వికెట్ తీశారు.