శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కోరమాండల్ ఎక్స్‌‍ప్రెస్ రైలు ప్రమాద మృతుల సంఖ్య 275 : ఒడిశా సర్కారు క్లారిటీ

Train accident
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒడిశా ప్రభుత్వం ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఇంతకుముందు 288 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పిన అధికారులు.. మృతదేహాల లెక్కింపులో పొరపాట్లు జరిగాయన ఇప్పటివరకు 275 మంది చిపోయారని అధికారులు పేర్కొన్నారు. 
 
'కొన్ని మృతదేహలను రెండు సార్లు లెక్కించారు. సంఘటన స్థలంలో లెక్కించి, ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మరోసారి లెక్కపెట్టారు. దీంతో మృతుల సంఖ్యలో తేడా వచ్చింది. చివరిసారి లెక్కించినప్పుడు స్పష్టత వచ్చింది' అని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ జెనా వెల్లడించారు.
 
మొత్తం 275 మంది మృతుల్లో ఇప్పటివరకు 78 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. మరో 10 మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మిగతా 187 వాటిల్లో 170 మృతదేహాలను భువనేశ్వర్‌కు, 17 మృతదేహాలను బాలేశ్వర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. 
 
మొత్తం 85 అంబులెన్స్‌ల ద్వారా మృతులను భువనేశ్వర్‌లోని వివిధ మార్చురీలకు తరలించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా, మృతులు, క్షతగాత్రుల ఫొటోలను https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org. వెబ్‌సైట్లలో పొందుపరిచామని, ఎవరైనా గుర్తిస్తే.. 18003450061 లేదా 1929 నెంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు.