వాల్మీకి జయంతి : బోయవాడు వాల్మీకి ఎలా అయ్యాడు.. రామ మంత్ర మహిమ..
Valmiki jayanthi 2025
రామాయణం అదికావ్యంగా పూజ్యనీయమైంది. ఇంతటి గొప్ప కావ్యాన్ని మానవాళికి అందించి చిరస్మరణీయుడైన వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవడం ద్వారా శ్రీరాముని అనుగ్రహం పొందవచ్చు. అక్టోబర్ 7వ తేదీ వాల్మీకి జయంతి.
పూర్వాశ్రమంలో రత్నాకరుడనే బోయవాడు. ఇతను అరణ్యాల్లో దారికాచి బాటసారులను దోచుకుంటూ తన భార్యాబిడ్డలను పోషించుకుంటుండేవాడు. నారద మహర్షితో తారక మంత్రోపదేశం పొందిన బోయవాడు ఆనాటి నుంచి రామ తారక మంత్రాన్ని అకుంఠిత దీక్షతో జపం చేయసాగాడు. అలా ఎన్నో ఏళ్ళు గడిచాయి.
కొన్నేళ్లుగా అతను అలాగే తపస్సు చేస్తూ ఉన్నందున ఆ బోయవానిపై వల్మీకములు అంటే పుట్టలు ఏర్పడ్డాయి. నారదుడు అతన్ని పైకి లేపి అభినందించాడు. అలా వాల్మీకం నుంచి బయట పడ్డాడు కాబట్టి నారదుడు ఆ బోయవానికి వాల్మీకి అని నామకరణం చేసి రామాయణ మహాకావ్యం రచించే పనిని అప్పజెప్పాడు.
