సంబంధిత వార్తలు
- సన్యాసిగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే... స్వామి శివరామానందగా పేరు మార్పు
- తితిదే షాకింగ్ నిర్ణయం: మళ్లీ శ్రీవారి ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు
- నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు.. వామ్మో వడగాలులు
- తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. ఏపీలో 1288, తెలంగాణలో 956 కేసులు
- జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ
శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి లేనట్టే : తితిదే
కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం వాయిదా వేసినట్లు తితిదే ఆలయ అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పరిస్థితులు సాధారణస్థితికి రాగానే ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయాన్ని ముందుగానే తెలియజేస్తామని వెల్లడించింది.
కాగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు పలు మార్గదర్శకాలు, సూచనుల చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగా శ్రీవారి దర్శన టిక్కెట్ చేయించుకున్న భక్తులను ముందుగానే కొండపైకి అనుమతించడం కూడా లేదు.
తర్వాతి కథనం
