సంబంధిత వార్తలు
- సికింద్రాబాద్ డిపోలో ఎలక్ట్రిక్ బస్ దగ్ధం
- తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం - వెబ్సైట్లో మోడల్ ప్రశ్నపత్రాలు
- ఏపీ మంత్రి గౌతం రెడ్డి హఠాన్మరణం - తెలంగాణ నేతల సంతాపం
- తెలంగాణాలో గ్రేప్ ఫెస్టివల్ - తిన్నోళ్లకు తిన్నంత ద్రాక్ష
- సీఎం కేసీఆర్ వెంట నటుడు ప్రకాష్ రాజ్: పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారా?
భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. ముహూర్తం ఎప్పుడంటే?
భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం సడలించడంతో మిథిలా స్టేడియంలో వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీరామనవమి వేడుకలు జరపాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వైదిక కమిటీ తెలిపింది. ఏప్రిల్ 10న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6న ఉత్సవ మూర్తులకు విశేష స్నపనం, ఉత్సవ అంకురార్పణ, 8న అగ్నిప్రతిష్ట, 9న ఎదుర్కోలు ఉత్సవం, ఏప్రిల్ 11న శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
