1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (08:59 IST)

సరికొత్త చరిత్రను లిఖించిన లాంగ్ జంపర్ శ్రీశంకర్

murali srisankar
కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ శ్రీశంకర్ లాంగ్ జంపర్ విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. లాంగ్ జంప్‌ ఫైనల్స్ విభాగంలో ఈ కేరళ కుర్రోడు మురళీ శ్రీశంకర్ తన ఐదో ప్రయత్నంలో ఏకంగా 8.08 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఇక బహమాన్‌కు చెందిన లకాన్ నైర్న్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
నిజానికి ఈ క్రీడల్లో భారత అథ్లెట్స్ అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఫలితంగా భారత ఖాతాలో వివిధ రకాల పతకాలు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా బుధవారం హైజంప్‌లో తేజస్విని శంకర్ కాంస్య పతకం గెలిస్తే, గురువారం లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజతం గెలుచుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఈ రెండు విభాగాల్లో భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. 
 
అయితే, గురువారం జరిగిన లాంగ్ జంప్‌ ఫైనల్స్ పోటీల్లో కేరళ యువకుడు మురళీ శ్రీశంకర్ తన ఐదో ప్రయత్నంలో ఏకంగా 8.08 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలించాడు. బహమాన్‌కు చెందిన లకాన్ నైర్న్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 
 
అయితే, లకాన్ కూడా 8.08 మీటర్లే దూకినప్పటికీ అతని రెండో బెస్ట్ అటెమ్ట్ (7.98 మీటర్లు) శ్రీశంకర్ (7.84 మీటర్లు) కంటే మెరుగ్గా ఉండటంతో మొదటిస్థానం దక్కించుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో లాంగ్ జంప్ విభాగంలో భారత్‌ పతకం సాధించిన రెండో ఆటగాడిగా శ్రీశంకర్ నిలిచాడు. 
 
నిజానికి గత 1978లో కెనడాలో జరిగిన ఈ క్రీడల్లో సురేశ్ కాంస్య పతకం గెలుపొందాడు. ఆ తర్వాత లాంగ్ జంప్‌లో భారత్‌కు కామన్వెల్త్ క్రీడల్లో పతకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.