బుధవారం, 24 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 డిశెంబరు 2025 (17:37 IST)

అర్థరాత్రి ప్రియుడితో నగ్నంగా భార్య.. హఠాత్తుగా ఇంటికి వచ్చిన భర్త.. తర్వాత ఏం జరిగింది?

murder
రాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన ప్రియుడుని అర్థరాత్రి సమయంలో ఇంటికి పిలిపించుకుని అభ్యంతరకరస్థితిలో నగ్నంగా ఎంజాయ్ చేస్తుండగా, హఠాత్తుగా భర్త ఇంటికి వచ్చాడు. ఇంట్లో తన భార్య పరాయి పురుషుడుతో నగ్నంగా ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. అయితే, భార్య మాత్రం ఏమాత్రం తొట్రుపాటుకు గురికాకుండా తన భర్తతో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసిన సూట్‌కేసులో కుక్కి నీటి కాలువ, ఊరి చివర నిర్మానుష్యం ప్రాంతంలో పడేసింది. అయితే, ఆ మహిళ చేసిన పాపం పండటంతో పోలీసులు కేసు చేదించి మహిళతో పాటు ఆమె ప్రియుడుని కూడా అరెస్టు చేశారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ బ్లైండ్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 15న చందౌసి ప్రాంతంలోని ఒక ఈద్గా వెనుక నల్లటి బ్యాగులో కుళ్లిన స్థితిలో ఒక మనిషి మొండెం లభ్యమైంది. తల లేకపోవడంతో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, ఆ మొండెం చేతిపై 'రాహుల్' అనే పేరు టాటూగా ఉండటాన్ని పోలీసులు గమనించారు. అదే ఈ కేసులో కీలకంగా మారింది.
 
రాహుల్ అనే పేరుతో ఉన్న మిస్సింగ్ కేసులను ఆరా తీయగా రూబీ అనే మహిళ తన భర్త రాహుల్ కనిపించడం లేదని నవంబరు 24న ఫిర్యాదు చేసినట్టు తేలింది. పోలీసులు ఆమెను పిలిపించి ఆ మొండెం పక్కన ఉన్న బట్టలను చూపించారు. కానీ ఆ కిలాడీ భార్య ఏమాత్రం తడబడకుండా 'ఇవి నా భర్తవి కావు' అని చెప్పింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు.
 
పోలీసులు రూబీ ఫోన్ గ్యాలరీని వెతుకుతుండగా ఒక ఫోటో కనిపించింది. అందులో తన భర్త రాహుల్ వేసుకున్న టీ-షర్ట్, ఆ బ్యాగులో దొరికిన టీ-షర్ట్ ఒకటేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ ఫోటోను చూపించి గట్టిగా నిలదీయడంతో రూబీ అసలు విషయాన్ని అంగీకరించింది. 
 
రూబీకి గౌరవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, నవంబరు 17వ తేదీన అర్థరాత్రి రూబీ తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో హఠాత్తుగా భర్త రాహుల్ రావడంతో వారిద్దరినీ అభ్యంతరకర స్థితిలో చూశాడు. గొడవ మొదలవడంతో రూబీ, గౌరవ్ కలిసి రాహుల్ తలపై బలంగా కొట్టి అక్కడికక్కడే చంపేశారు.
 
నేరం బయటపడకుండా ఉండేందుకు మరుసటి రోజు కట్టర్ మెషీన్‌ను తెప్పించి రాహుల్ శరీరాన్ని ముక్కలుగా కోశారు. వాటిని ఒక బ్యాగులో పెట్టి 50 కిలోమీటర్ల దూరంలోని గంగా నదిలో పడేశారు. మొండాన్ని మరో బ్యాగులో పెట్టి ఊరి బయట పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారం రోజుల తర్వాత స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు తాజాగా ఆ ఆ కట్టర్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూబీ, ఆమె ప్రియుడు గౌరవన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నదిలో పడేసిన మిగిలిన శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు.