శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (22:43 IST)

తిరుమల సమాచారం.. ఉద్యోగాలు.. కల్యాణోత్సవం సేవా టిక్కెట్ వివరాలు

tirumala
తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే అవకాశం నిరుద్యోగులకు దక్కనుంది. కొత్తగా పెళ్లయిన జంటకు పెళ్లయిన ఏడు రోజులలోపు కల్యాణోత్సవం సేవా టిక్కెట్టు లభిస్తుంది. టిక్కెట్ ధర జంటకు వెయ్యి రూపాయలు 
 
ఇందుకోసం సీఆర్వో కరెంట్ బుకింగ్ కార్యాలయంలో ఒకరోజు ముందుగా తిరుమలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నమోదు చేసుకోవాల్సి వుంటుంది. 
 
ఇందుకోసం వెడ్డింగ్ కార్డు, రెండు పెళ్లిఫోటోలు, ఆధార్ కార్డులు తీసుకురావాల్సి వుంటుంది. నమోదు చేసుకున్న మరుసటి రోజున కల్యాణోత్సవం సేవ నిర్వహిస్తారు.
 
ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు 
ఒంమిట్టలోని శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్ 17-26 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి, ఆలయ ప్రాంగణంలో టిటిడి, వైఎస్ఆర్ కడప జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 
 
ఏప్రిల్ 22న జరిగే శ్రీ సీతారామ కళ్యాణం మహా ధార్మిక రాష్ట్ర ఘట్టానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
 
సోమవారం ఒంటిమిట్టలో వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌, టీటీడీ జేఈవో, జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్‌ కౌశల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో టీటీడీలోని అన్ని శాఖల అధికారులు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీ జేఈవో ఆదేశించారు.ఏప్రిల్ 16న అంకురార్పణం, 17న శ్రీరామ నవమి నాడు ద్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
 
ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 21న గరుడవాహనం, 22న దివ్య శ్రీ సీతారాముల కల్యాణం రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర ముఖ్యమైన రోజులలో ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగం జరుగనుంది.
 
టీటీడీలో ఉద్యోగాలు.. 
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం.. శాశ్వత ప్రాతిపదికన టీటీడీ (టీటీడీ) డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 49 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులున్నాయి. 
 
ఈ పోస్టులకు మార్చి 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌‌ను సందర్శించవచ్చు.